ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై హర్షం
–సీఎం, విద్యాసాగర్కు రామసుబ్బయ్య యాదవ్ కృతజ్ఞతలు సలాం ప్రొద్దుటూరు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో అభినందన సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు డిమాండ్ల పరిష్కారానికి కృషి...