శ్రీరామచంద్రస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నంద్యాల...