ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యం
–సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో “స్వచ్ఛ సంకల్ప దీక్ష” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగడమే కాకుండా ప్రజారోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం...