ఎమ్మెల్యేలు మారినా.. దోమలు పోలేదు.. ఇర్ఫాన్ బాషా

–ప్రభుత్వాల వైఫల్యమే ప్రొద్దుటూరు ప్రజల దోమల కష్టాలకు కారణం  సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో దోమల సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్‌ బాషా అధికార పార్టీపై రాజకీయ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలు ఎదుర్కొంటున్న దోమల సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని ఆయన ఆరోపించారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చినా, దోమల బెడద మాత్రం ప్రజలను వీడలేదని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల లో ...