శెట్టివారిపల్లిలో క్రీడా మైదానం అభివృద్ధికి శ్రీకారం

మైదుకూరు: మైదుకూరు పురపాలిక పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామంలో క్రీడా మైదానం అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, MEIL సహకారంతో గ్రామంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, వారికి మెరుగైన క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. మైదానం అందుబాటులోకి వచ్చిన అనంతరం శెట్టివారిపల్లి యువత, విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, పరుగు తదితర క్రీడల్లో సాధన చేసేందుకు...