గంటలోనే బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన కదిరి పోలీసులు
–డయల్ 100 ఫిర్యాదుపై వేగంగా స్పందన.. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత సలాం ప్రొద్దుటూరు – కదిరి: కదిరి పట్టణంలోని వలీసాబ్ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఘటనపై కదిరి టౌన్ పోలీసులు వేగంగా స్పందించి గంటలోపే బాలుడిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే...