గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

  సలాం ప్రొద్దుటూరు –గోపవరం: గోపవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, బచ్చల ప్రతాప్, మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.