స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది –చల్లా 

సలాం ప్రొద్దుటూరు:   1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని రామేశ్వరంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. వారి...