సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు విజయ్ భాస్కర్ రెడ్డి, సురేష్, నాగేంద్ర, సూర్యనారాయణ రెడ్డి, గంగాధర్, వైస్ చైర్మన్ మహ్మద్ గౌస్, బ్యాంక్ సీఈఓ నిరంజన్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
