అన్నా క్యాంటీన్తో పేదలకు రుచికరమైన భోజనం.. ప్రజల ఆదరణే లక్ష్యం
–ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ సేవలను మరింత విస్తృతం చేస్తాం– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సలాం ప్రొద్దుటూరు : నిరుపేదలు, సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రుచికరమైన, తృప్తికరమైన అల్పాహారం, భోజనం అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. అన్నా క్యాంటీన్ కేవలం భోజనం అందించే కేంద్రం మాత్రమే కాకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఆత్మీయత, గౌరవం, భరోసా అందించే ప్రజా సేవా కేంద్రంగా నిలవాలన్నదే...