సలాం ప్రొద్దుటూరు:
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 11వ వార్డులోని బూత్ నంబర్ 93 పరిధిలో “ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమాన్ని దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పుట్టి రమేష్, ఉట్టి మురళి, పోస ప్రసాద్, నీలకంఠరెడ్డి, సాధు ప్రసాద్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.