అన్న క్యాంటీన్లో భోజన నాణ్యతపై ఆరా తీసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి
–“ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో పేదలతో మమేకం సలాం ప్రొద్దుటూరు: “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మంగళవారం ప్రొద్దుటూరు పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. క్యాంటీన్లో భోజనం చేస్తున్న పేదలు, కార్మికులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచికరంగా, బాగుందని పలువురు లబ్ధిదారులు మాజీ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన...