SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 5:04 pm Posted by : SALAM PRODDATUR

22వ వార్డులో హోరెత్తిన టీడీపీ ప్రచారం

 

 

 

సలాం  ప్రొద్దుటూరు:

 

 

 

తెలుగుదేశం పార్టీ–కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు.

 

 

 

ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వ పాలనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

 

 

ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, క్లస్టర్ ఇన్‌చార్జ్ తలారి రమేష్, బేపారి ఆరీఫ్ అహమ్మద్, బూత్ ఇన్‌చార్జ్ మాదూర్ మున్నా, వరపకుల ఖాదర్ బాషా, ఇనాయతుల్లా, గౌసపీర్, సిమెంట్ ఆసిఫ్, పీరు, రఫీక్, అలీ, దస్తగిరి బాషా, పూల జాఫర్, ఉప్పలూరు రసూల్, అబ్దుల్లా, నజీర్తో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.