SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:34 am Posted by : SALAM PRODDATUR

4వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

 

–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రొద్దుటూరు పట్టణంలోని 4వ వార్డులో శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పారదర్శకంగా అందజేస్తోందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.