SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:08 pm Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్యేలను కలిసిన నూతన ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసిల్దార్

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు నూతన ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్  గా బదిలీపై వచ్చిన అజర్ అలీ ఖాన్  శుక్రవారం  మర్యాదపూర్వకంగా   ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టిన అజర్ అలీ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

అనంతరం అజర్ అలీ ఖాన్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.