25వ వార్డులో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం..

  –ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండా రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.   ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు....