ఖాదర్ వలీ ఆధ్వర్యంలో 25వ వార్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికీ టీడీపీ – డోర్ టు డోర్" కార్యక్రమాన్ని బుధవారం ప్రొద్దుటూరులోని 25వ వార్డులో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ నేతృత్వంలో 25వ వార్డు టీడీపీ ఇన్చార్జి కమలాపురం షేక్ ఖాదర్...