సలాం ప్రొద్దుటూరు:
పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నిధి మీనా, ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కు సూచించారు.
నూతనంగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా ప్రత్యేక అధికారిని కలిసిన సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బందితో సమన్వయం పెంచుకుని పనిచేయాలని, పట్టణంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి ప్రజలకు నిత్యావసరమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని నిధి మీనా పేర్కొన్నారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ కూడా పాల్గొన్నారు.