కమీషనర్‌తో ముఖాముఖీకి విశేష స్పందన

  –గంటలోనే 26 ఫిర్యాదులు.. –పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలే ప్రధాన సమస్యలు   సలాం ప్రొద్దుటూరు: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ప్రారంభించిన "కమీషనర్‌తో ముఖాముఖీ" ఫోన్-ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గంట వ్యవధిలోనే 26 ఫిర్యాదులు ఫోన్ ద్వారా నమోదయ్యాయి.   నమోదైన ఫిర్యాదుల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు అధికంగా ఉండగా, మురుగునీటి...