తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం అంటూ రూ.6.50 లక్షలు కాజేసిన మోసగాడు అరెస్ట్..

  –నకిలీ బంగారు కడ్డీలు, ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం –ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చాకచక్యం   సలాం ప్రొద్దుటూరు:   తక్కువ ధరకే ఎక్కువ బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు వసూలు చేసి నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి మోసానికి పాల్పడిన వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.150/2026, సెక్షన్ 318(4) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఈ కేసు వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ యు....