దొరసానిపల్లెలో మాడెం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాడెం సుధాకర్ రెడ్డి సోదరుడు మరణించిన విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం దొరసానిపల్లెలోని వారి స్వగృహానికి వెళ్లారు.   మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాడెం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.