మట్టి మసీదు వీధిలో దొరికిన మొబైల్‌ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు బాలురు..

సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని మట్టి మసీదు వీధిలో దొరికిన ఓ మొబైల్ ఫోన్‌ను ఇద్దరు బాలురు నిజాయితీతో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలుర బాధ్యతాయుత చర్యను పోలీసులు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మట్టి మసీదు వీధిలో గుర్తుతెలియని మొబైల్ ఫోన్‌ను గుర్తించిన ఇద్దరు బాలురు ఎలాంటి స్వార్థం లేకుండా వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా వారి నిజాయితీని పోలీసులు ప్రశంసించారు. ఎవరికైనా మొబైల్ ఫోన్ పోయి ఉంటే, దానికి సంబంధించిన యాజమాన్య...