అగస్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

  సలాం ప్రొద్దుటూరు  (కల్చరల్ ): ప్రొద్దుటూరు లోని అగస్యేశ్వరాలయంలో అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రదోష కాల సమయంలో పంచామృత నానావిధ సుగంధ ద్రవ్య రుద్రాభిషేక సహితముగా స్వామివారికి సహస్రనామ భస్మార్చన భస్మహారతి అమ్మవారికి కుంకుమార్చనలు చాలా ఘనంగా జరిగాయి. వందలాది మంది భక్తాదులు వచ్చి స్వామి అమ్మవార్లని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  స్వామివారి సేవ ఆలయ ఈ.ఓ కే.వీ. రమణ , ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి  మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములచే ఘనంగా జరిగాయి.