ఏపీ పాలిసెట్–2026 తొలి దశ వెబ్ కౌన్సెలింగ్ 24 నుంచి ప్రారంభం
సలాం ప్రొద్దుటూరు : ఏపీ పాలిసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం తొలి దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సర్టిఫికెట్లు ధ్రువీకరించబడని లేదా సవరణలు అవసరమైన...