SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 6:39 pm Posted by : SALAM PRODDATUR

జగన్ ను తిరిగి ముఖ్య మంత్రి చేసేందుకు కృషి చేయాలి –ఏం ఎల్ సీ

సలాం ప్రొద్దుటూరు:

వై యస్   జగన్ ను తిరిగి ముఖ్య మంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ ఏం ఎల్ సి రమేష్ యాదవ్ పిలుపు ఇచ్చారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రజకుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమీక్ష సమావేశం లో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వైయస్‌ఆర్‌సీపీలో ఏ బీసీ నాయకుడు, కార్యకర్త కూడా పదవి ఆశించి పని చేయడం లేదన్నారు.కూటమిలోని బీసీ వాళ్లను మీ నాయకుడు ఎవరు? అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి దాపరిల్లిందని ఇందుకు కారణం ముగ్గురు నాయకులు కూటమి పాలన ఉండడం అన్నారు.కానీ వైయస్‌ఆర్‌సీపీలోని బీసీలకు ఆ పరిస్థితి లేదనీ, వైయస్‌ఆర్‌సీపీ ను  ఒకే ఒక్క నాయకుడు వైయస్ జగన్ ఉన్నాడని తెలిపారు.