మహాకవి శ్రీ శ్రీ కి ఘన నివాళులు..
సలాం ప్రొద్దుటూరు: తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, శ్రీశ్రీ రచనలు సామాన్య ప్రజల జీవన విధానం, శ్రామికుల కష్టాలు, సామాజిక అసమానతలు, విప్లవాత్మక ఆలోచనలను ప్రతిబింబిస్తూ తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సృష్టించాయని పేర్కొన్నారు. ఆయన రచించిన “మహాప్రస్థానం” తెలుగు...