SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 11:07 pm Posted by : SALAM PRODDATUR

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

 

సలాం ప్రొద్దుటూరు:

 

ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

 

త్వరలో నోషనల్ ఇంక్రిమెంట్ అమలు .ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ . అంతర్‌జిల్లా బదిలీల పరిశీలన . స్పౌజ్ ట్రాన్స్‌ఫర్ల అమలు . పే స్కేల్ అమలుకు చర్యలు

ఇప్పటికే వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూ శాఖలకు చెందిన 7,246 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు.

అలాగే పనిభారం తగ్గింపు, సెలవుల ఆమోదంలో సౌలభ్యం, ఉద్యోగుల గ్రీవెన్స్ పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సచివాలయ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.