శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రొద్దుటూరుకు రాక

సలాం ప్రొద్దుటూరు : శనివారం ప్రొద్దుటూరుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రొద్దుటూరు వస్తున్నారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి 2025 వరకు జరిగిన జగనన్న కాలనీ సంబంధించిన అవినీతి అక్రమాలపై విచారణ చేసేందుకు వస్తున్నారని తెలిపారు. జగనన్న కాలనీలలో మూడు కాలనీలు సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి అవకతవగలపై సమగ్ర విచారణ చేపడతారని వివరించారు.