జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మికి సన్మానం
సలాం ప్రొద్దుటూరు (అనంతపురం): ఉమ్మడి అనంతపురం జిల్లా సీఈఓగా ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని గురువారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన పరిపాలనాధికారుల(ఏఓ)తో జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ విజయలక్ష్మిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.