SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:14 pm Posted by : SALAM PRODDATUR

విశాఖ ఉక్కు ఘటన అందరి మనస్సులను కలిచి వేసింది –రాచమల్లు

సలాం ప్రొద్దుటూరు:

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల మరణాలు విషాదాన్ని మిగిల్చింది,విషాదించదగ్గ విషయం.

మరణించిన కార్మికుల కుటుంబాలకు వైసిపి సంతాపాన్ని తెలియచేస్తోంది.

కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయండంతో వల్లనే ఈ ప్రమాదం జరిగింది,దీనికి ప్రభుత్వం కారణం.

8 మంది కార్మికులు మృతి చెందితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ అక్కడికి పోలేదు వారిని పరమర్శించలేదు.

గతంలో గ్యాస్ లీక్ అయితే జగన్ 3 గంటల్లో అక్కడికి చేరుకొని కార్మికులను పరామర్శించాడు 1 కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాడు.

ఈ మానవత్వం లేని ప్రభుత్వం కార్మికుడి మృతికి కేవలం 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చారు.

లోకేష్ అక్కడికి వెళ్లి కార్మిక సంఘ నాయకులతో అవహేలనగా,ఆగ్రహంగా మాట్లాడాడు.

లోకేష్ తీరు సంస్కరహీనంగా ఉంది.

కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన హోంమంత్రి అనిత హృదయంలో బాధ లేదు,మొహం మీద మేకప్ కనిపిస్తోంది.

బ్రహ్మ దేవుడు మీ పక్షాన ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో మీకు అధికారం వచ్చే పరిస్థితి లేదు.

మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు 175 నియోజకవర్గాల నుండి మేము సిద్ధంగా ఉన్నాము.