SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 11:56 am Posted by : SALAM PRODDATUR

పెన్నానదిలో ఇద్దరు గల్లంతు

–ఒకరి మృతదేహం వెలికి తీత

–గల్లంతైన మహిళ కోసం ముమ్మర గాలింపు

సలాం ప్రొద్దుటూరు :

వైయఎస్ఆర్ కడప మైలవరం మండలం వేపరాల సమీపంలోని పెన్నా నదిలో విషాద ఘటన చోటు చేసుకుంది.మండలంలోని తొర్రివేములకు చెందిన కుటుంబ సభ్యులు సరదాగా స్నానానికి నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు కళ్యాణ్ కుమార్ (25), అతని అత్త వెంగమ్మ (45) నీటిలో గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, అ.గ్నిమాపక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీయగా.. వెంగమ్మ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు