SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:50 pm Posted by : SALAM PRODDATUR

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత–ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు:

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని తద్వారా భావి తరాలు బాగుంటాయని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రాజీవ్ గాంధీ పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  రేంజ్ పరిధిలోని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి  హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.చెట్లు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ సబ్ డి ఎఫ్ ఓ సంకేత్ సునీల్ గరుడ్ ,అటవీ రేంజ్ అధికారి హేమంజలి ,అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి లక్ష్మీ కుమారి ,సోములవారి పల్లె మాజీ సర్పంచ్ సాంబశివుడు ,అటవీ శాఖ సిబ్బంది,నాయకులు,సందర్శకులు పాల్గొన్నారు.*